Tuesday 27 November 2012

Matsyagiri published in namasthetelangaana on 25-11-2012

మరో యాదగిరి... మత్స్యగిరి
- డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ
chepa-aakaarapu-saalagraamaమత్స్యం అంటే చేప కదా! మత్స్యగిరి చేప ఆకారంలో ఉంటది. కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. అయితే మత్స్యగిరి దగ్గరనున్న పొట్టిగుట్ట దగ్గర్నుండి వెళ్తే ఈ గిరి అచ్చంగా చేప ఆకారంలో కనిపిస్తది.
మత్య్సగిరిని వేములకొండ పల్లె పరిసరాల నుంచి సగం వరకు ఎక్కగానే ఒక ప్రాచీన శిలా ద్వారం కనిపిస్తది. ఆ ద్వార బంధానికి ఒక చేప శిల్పం చెక్కి ఉండటం మరో విశేషం. ప్రస్తుతం శిథిలమైనప్పటికీ ఆ శిల్పం సుమారు మూడడుగుల పొడవుంటది.

మత్స్యగిరి శిఖరాక్షిగాన చిన్నపాటి చెరువుంది. ఈ చెరువూ ఒక వింత. సాధారణంగా పెద్ద పెద్ద కొండల్లో ఇంకిన వర్షపు నీరు పారి కొండల కింద చెరువు లేర్పడతాయి. కానీ పైన చెరువుండటం నిజంగా వింతే! దీన్నే భక్తులు ‘భగవంతుని లీలా మహత్మ్యం’ అంటున్నరు.

ఈ చెరువులోని చేపలు మరో ముఖ్య విశేషం. ఇందులో ఉండేవన్నీ ఒకే రకపు చేపలు. అవన్నీ ఒక పరిణామంలో...సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్లలాగా దొమ్మరి గంతలు వేస్తూ కనిపిస్తయి. వాటన్నింటి తలమీద మూడేసి విష్ణు నామాలుంటయి. ఇది మరీ ఆశ్చర్యానందాలకు గురి చేసే అంశం. ఎందుకంటే, ఇదివరకెప్పుడూ మనం ఇలాంటి నామాల చేపలను చూసి ఉండం!

laxminarasimha-svaamiఅయితే, ఈ చేపలుండే గుండం నిజానికి మూడు గుండాల సముదాయం. వీటి పేర్లు నామాలగుండం, విష్ణు గుండం, మాల గుండం. నీటి మట్టం పెరిగినప్పుడు ఇవి మూడూ కలిసిపోయి నైరుతి నుంచి ఈశాన్యం వైపు అర్ధచంవూదాకారపు వంపు తిరిగిన ఒకే గుండం లాగా కనిపిస్తయి. ఈ అర్ధ చంద్రకారపు గుండం మధ్యలో అంటే గుండం పడమటి ఒడ్డున...నీటి అంచున ఆరడుగుల పొడవైన చేప విగ్రహముంది. ఈ విగ్రహం చేప పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు తిరిగినట్లుగా కనిపిస్తది. చేప మఖం మాత్రం తూర్పువైపుకు తిరిగి ఉంటుంది.

ఈ విగ్రహం చుట్టూనే 1991లో ఆలయం కట్టారు. గుండంలో నీటిమట్టం పెరిగినప్పుడు ఈ చేప సాలక్షిగామం నీటిలో తేలియాడుతున్నట్లు కనపడుతుందని అక్కడి పూజారి లక్ష్మణాచార్యులు చెప్పారు. ఈయన ఈమధ్య ఈ మత్స్యగిరి స్థలపురాణం, ఇటీవలి చరివూతను కూడా నిక్షిప్తం చేసే పనిలో ఉన్నరు. జిన్నం అంజయ్య అనే మరొక కవి కూడా ఈ మధ్యనే మత్స్యగిరిపై శతకం రాసి ప్రచురించారు.

మత్స్యగిరి పైన వృద్ధులు, రోగిష్టులు కనిపించడం సాధారణం. కొండ కిందికి ప్రయాణిస్తున్నప్పడు పైకి వెళ్తున్నప్పుడు రోగులు కనిపిస్తుంటరు. విచారిస్తే పైన కొన్నాళ్ళుంటే చాలు ఎంతటి క్లిష్టమైన రోగాలైనా నయమవుతాయని చెప్తరు. దేవుడి మహితో పాటు నీటికి కూడా రోగాలను నయం చేసే శక్తి ఉందన్నది ఇక్కడికి వచ్చేవాళ్ల విశ్వాసం.

నిజానికి కూడా భూ ఉపరితలం పైన నాలుగైదు వందల అడుగుల ఎత్తున ఉన్న ఈ మత్స్యగిరి ఆలయం పైకి స్వచ్ఛమైన, చల్లని గాలులు వీస్తుంటయి. మత్స్యగుండం కూడా కాలుష్యానికి దూరంగా ఉండి స్వచ్ఛమైన నీటికి ఆలవాలంగా ఉంది. ఇటీవలి కాలం వరకూ ఈ గుండంలో ఉన్న తామర చెట్ల ఆకులు కూడా ఆ గుండంలోని మలినాలను, సూక్ష్మజీవులను గ్రహించి నీటిని పరిశుద్ధంగా ఉంచేవి. కాబట్టి, అంటువ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మక్షికిములకు దూరంగా ఈ మత్స్యగిరిపై కొంతకాలం ఉండి, పరిశుద్ధమైన నీటిని తాగితే రోగాలు నయమవుతుండేవని చెబితే నమ్మడానికేమి అభ్యంతరం ఉండదు! ఇక ఈ మత్స్యగుండం నీటిని తాగిన వారికి సంతానమయ్యేదని, పంట పొలాలు, చేలపై చల్లుకుంటే కీటకాలు నశించి పంటలు బాగా పండేవని కూడా స్థానికులు చెబుతుంటరు.

కొచ్చెగుట్టపైన కూడా ఒక మడుగు (గుండం) ఉంది. ఈ గుట్టను ఎక్కితే మంచి ట్రెక్కింగ్ ప్రాక్టీస్ అవుతది. ఇక్కడి మడుగులో రాయి వేస్తే భిన్నమైన శబ్ధం వస్తుంది. బహుశా గుట్ట నిలువునా లోతైనా బావిలాంటి గుండం ఉండడం వల్లనేమో...అలాంటి శబ్దం వస్తది. ఈ గుండం నీటిలో స్నానం చేస్తే చర్మ రోగాలు నయమవుతాయంటారు.

ఇక మాలగుట్ట గుహల్లో కూడా ఒక చిన్న గుంట ఉంది. ఆ గుంటలో నీరును మనం తీసిన కొద్దీ అంతే పరిమాణంలో నీరు మళ్ళీ ఊరడం విశేషం.

matsyagunDam-teeraana-aalayప్రస్తుతం మత్స్యగిరిపై కనిపిస్తున్న, ఆలయ మంటపాదులు 1977 నుంచి నిర్మించబడుతున్నవే. అయితే, ఈ గిరి పరిసరాల్లో కనిపిస్తున్న శిథిల ఆలయాల చరిత్ర మాత్రం వేల ఏళ్ల వెనకాలది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయానికి దక్షిణంగా గుట్టను సగం దిగాక కనిపిస్తున్న శివాలయం చాలా ప్రాచీనమైంది.
ఎక్కడైనా ప్రాచీన ఆలయాలు పూర్తిగా రాతితో గాని, ఇటుకలతో గాని నిర్మించబడుతయి. ఈ శివాలయం గర్భగృహానికి మాత్రం మూడు వైపులా పవేశ దిశ మినహా) ఇటుకల గోడలున్నయి. వాటి లోపల రాతిగోడలున్నయి. ఈ ఇటుకల పొడవు, వెడల్పులు 14X10 అంగుళాలు.

14 అంగుళాల పొడవున్న ఇటుకల వాడకం సుమారు 1400 సంవత్సరాల కిందట ఉండేదని తెలుస్తోంది. ఈ ఇటుకల గుడి వాస్తు నిర్మాణ శైలిని బట్టి ఇది ఆనాడు ‘జైనుల మందిరం’ అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇది శ్వేతాంబర జైనులది. శ్వేత అంటే తెల్లని అని అర్థం. స్థానిక ప్రాకృత తెలుగు భాషలో ‘వలి’ అంటే తెల్లని అని అర్థం. దగ్గర్లోని వలిగొండ అనే ఊరు ఆనాడు శ్వేతాంబర జైన ప్రాబల్యమున్న ఊరే అయ్యుంటుందని భావిస్తున్నరు. పక్కనే వేముల కొండ ఉంది. వేములు అంటే కూడ జైనులే. ఆ పక్కనే మునిపంపుల అనే ఊరుంది. ‘మునులు’ అంటే జైన మతానికి చెందిన ఋషులు. మత్స్యగిరి పక్కనున్న మాలగుట్ట పైనా జైనుల గుహలున్నయి.

జైనులు తమ మతానికి ప్రతీకగా చేపను చూపుతరు. మీననాధుడు అనే ప్రఖ్యాతి చెందిన సిద్ధుడు కూడా జైనుడే. 24 మంది జైన తీర్థంకరుల్లో ఒకరికి ప్రతీక చేపనే. జైనులే మాల, మాదిగలకు ఆలయ ప్రవేశం కల్పించారు. కాబట్టి ఇక్కడ మాలగుట్ట, మాలగుండం, మాదిగగుండం లాంటివి కన్పిస్తున్నయని భావించవచ్చు.

మత్స్యగిరి వెళ్లాలంటే...
ప్రయాణ మార్గంలో చౌటుప్పల్ నుండి ఇరుపక్కలా మూడు రంగుల్లో కొండలు ఆకర్శిస్తయి. అవి పొట్టివి, పొడవైనవి, ఎత్తెనవి. తెల్లనివి, నల్లనివి, పచ్చనివి. ఇలా అన్నేసి కొండలు రంగురంగుల్లో కనిపిస్తుంటే ప్రయాణం మార్గంలోనే ఒక విశిష్టమైన భావన హృదయాలను పావనం చేస్తుంది. ఇక వలిగొండకు చేరుకునే ముందు మనకు కుడివైపున కనిపించే ఎత్తైన కొండల శిఖర ప్రదేశాల్లో శిలా తోరణాలూ కన్పిస్తయి. ఇలాంటి ఒక శిలా తోరణాన్ని తిరుపతిలో చాలామంది చూసే ఉంటరు. ఇక్కడ మాత్రం అలాంటివి మూడు తోరణాలు కనిపించి మనల్ని ముగ్దుల్ని చేస్తయి.

వలిగొండ దగ్గర కొండల మధ్య పారే ‘మూసీ’ హైదరాబాద్‌లో కనిపించినట్లుగా మురుగు నది కాదు, ముచ్చటైన నది. అంతేకాదు, ఇక్కడి పచ్చని చెట్లతోకూడిన లోయ మార్గం మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తది. గోధుమ వర్ణపు రాళ్ళపై నుండి తెల్లని నురగలు కక్కుతూ పారే ఆ నదీ సోయగం చూడవలసిందే. మూసీ పక్కనే వలిగొండ - అరూరుల మధ్యన ఉన్న చెరువు అందమూ ఆస్వాదించదగిందే. ఈ చెరువు పెద్దదే. ఇందులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరీ బాగుంటది. అయితే, మత్స్యగిరి ఎక్కిచూస్తే మన చుట్టూ గొలుసు కట్టు చెరువులు ఏడెనిమిది కనిపిస్తయి.

వలిగొండ చెరువును దాటిం తర్వాత గుట్టలు వింత ఆకారాలతో మనల్ని తన్మయుల్ని చేస్తయి. మొదటగా చెరువు ఒడ్డున కనిపించే చిన్నగుట్ట అందం మనల్ని కట్టి పడేస్తది. అందుకు కారణం...చెరువుపై నుంచి వీచే చల్లగాలులకు అది కేంద్రం కావడమే కాదు, దానిపైన ఉన్న వేయేళ్ళ నాటి ప్రాచీన చెన్నకేశవాలయం సౌందర్యం ఆ చెరువులో ప్రతిఫలించడం!

ఆరూరు దాటిన తర్వాత మత్స్యగిరికి మళ్ళే ముందు రోడ్‌పై నిల్చుని చూస్తే కనిపించే గుట్టల అందం అజరామరమైంది. ‘మాలగుట్ట’, ‘మత్స్యగుట్ట’ల మధ్య గుండ్రని ఎత్తైన ‘కొచ్చెగుట్ట’ పానవట్టంలోని శివలింగం లాగా సహజ సౌందర్యంతో శోభిల్లుతోంది.

మత్స్యగిరిపైకి ఇటీవల ఒక దాత గార్లపాటి సురేందర్‌డ్డి కోటి రూపాయలతో వేయించిన ఘాట్ రోడ్డు పచ్చని చెట్లమధ్య పారే నల్లని తాచుపాములాగా వంకర టింకరగా మెలికలు తిరుగుతూ మనల్ని అలరిస్తది. ఈ రోడ్డుకు వ్యతిరేక దిశలో...పశ్చిమం నుండి మత్స్యగిరి పైకి ఇప్పుడిప్పుడే నిర్మాణమవుతున్న రోడ్డు ఎర్రని మట్టితో గిరి అందానికి మరో రంగును అద్ది ఆకర్శింపజేస్తున్నది.

మత్స్యగిరికి తూర్పు - పడమర పాదాల్లో ఉన్న పల్లెలు వేములకొండపల్లె, ఆరూరుపల్లె, వాటి పరిసరాల పంటచేలు, తాటిచెట్లు, పశువుల మందలు - ఇవన్నీ గిరి ఔన్నత్యం ముందు చిన్న అంశాలుగా కనిపిస్తూ, మనకు విమానం లోంచి కిందికి చూస్తున్న అనుభూతిని కలిగిస్తయ్.

ప్రస్తుతం కనిపిస్తున్న శివాలయం మొదట జైన బసది కాగా సుమారు 12వ శతాబ్దంలో..అంటే కాకతీయుల కాలారంభ దశలో శివాలయంగా మార్చబడిందని దాని వాస్తు శైలిని బట్టి తెలుస్తోంది. ఈ ఆలయ మంటపం చూడదగింది. ఆలయంలోని శివలింగం ప్రస్తుతం ఆలయానికి ఎదురుగా ఉత్తరంలో ఉన్న సహజ కోనేరులో పడి ఉంది. నంది విగ్రహం మత్స్యగుండంలో మునిగిపోయింది. ప్రధానాలయానికి ఉత్తరం దిశలో ఈ మధ్యనే హనుమాన్ ఆలయం కట్టారు. ప్రధానాలయానికి ఎగువన (పడమర) తొలి చాళుక్యుల నాటి నకీ.శ. 600 ప్రాంతం) ఆలయముంది. కాగా, ప్రధానాలయానికి ముందున్న కోనేరుకు ఎదుట తూర్పు దిశలో పెద్ద 16 కాళ్ళ నవరంగ మంటపాన్ని కడుతున్నరు. టోల్‌గేట్ దగ్గర సీతారామాలయం ఈ మధ్యనే పూర్తయింది. ఈ ఆలయం వెనుక, దీనికి చేరే ముందు ఒకప్పటి ప్రాచీన ప్రవేశ మార్గాలు ఇప్పుడు శిథిలమైనా ఆసక్తిని రేకెత్తిస్తున్నయి. అక్కడ సత్రాలున్నయి.

మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం గమనార్హం.
నిశ్చయంగా ఈ ప్రాంతం జైన మత ప్రాబల్యం గలదని చెప్పే శిలాశాసనం ఒకటి ఇక్కడికి దగ్గరలోని సైదాపూర్‌లో లభించింది. అందులో అగ్గలయ్య అనే ఒక జైన శస్త్రచికిత్సకారుడు ఈ ప్రాంతంలోని ముచ్చనపల్లి, ఇక్కురికి అనే గ్రామంలో రెండు జైన బసదులను (మఠాలను) కట్టించాడని, ఆయనకు పశ్చిమ చాళుక్య రాజ్యంలో రాజుతో సమానమైన గౌరవం ఉందని రాసి ఉంది. ఈ రెండు బసదులకు స్థానిక గౌండు నగామాధికారి) క్రీ.శ. 1034 జూన్ 4వ తేదీన రెండు గ్రామాల భూములను దానం చేశాడు. ప్రస్తుతం మత్స్యగిరి పై ఉన్న శివాలయం, పొట్టిగుట్ట పైనున్న ఆలయాల నిర్మాణం ఆనాటి జైన బసదుల నాటిదే అంటున్నరు. శాసనంలో పేర్కొనబడ్డ ముచ్చనపప్లూయే తరువాతి శతాబ్దాలలో మత్స్యగిరి అయ్యింది.

పూర్వం ఒక వేటకాడు. మత్స్యగుండంలోని చేపలు పట్టి కూర వండుకోవడానికై వాటిని కోయగా అవి మళ్ళీ అతుక్కుపోయాయని వినిపించే స్థానిక కథ వెనుక కూడా అంతటి శస్త్ర పరిజ్ఞానం కలిగిన అగ్గలయ్య వంటి మేధావుల నేపథ్య కృషి ఉంది. అలాంటి వారే పాదరసంతో మత్స్యగుండం వంటి నీటి గుండాలను గుట్ట బండలపై కూడా ఏర్పరిచారని, ఒక ప్రత్యేకమైన చేప బ్రీడ్‌ను సృష్టించగలిగారన్నట్లు గౌరన ‘నవనాథ చరివూత’ ద్వారా తెలుస్తోంది. మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.

మత్స్యగుండంలో చిన్న పెడల్ బోట్లను, వలిగొండ - అరూర్‌ల మధ్యనున్న పెద్ద చెరువులో మరబోట్లను ఏర్పాటు చేసి, దగ్గరలోని మూసీ నది వెంట ట్రెక్కింగ్ మార్గాన్ని కల్పిస్తే మత్స్యగిరి ఒక మంచి ‘ఎకో- టూరిజం స్పాట్’ కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఇంతటి అపూర్వ దర్శనా స్థలం ఉండటం నిజంగానే విశేషం.

వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌లో క్యూరేటర్, మొబైల్: 94909 57078

Tuesday 6 November 2012

GaaDida jalapaatam published in Surya daily on 2-10-2012


‘గాడి’ద జలపాతం

గోదావరి నదికి అవతలి జిల్లా అదిలాబాద్‌, ఇవతలి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రాష్ర్టంలోనే అందమైన అడవులున్నారుు. గోదావరి లోయలో ఉన్న అడవులను తెలంగాణా గ్రీన్‌ వ్యాలీ అంటారు. ఈ గ్రీన్‌ వ్యాలీ అందం అదిలాబాద్‌ జిల్లాలో మరీ ఎక్కువ. అలాంటి అరుదైన, అందమైన అడవుల్లో మరింత అందమైన, అత్యంత ఎతైన జలపాతం ఉందని ఆ ప్రాంతం లోని ఒక్కరికి కూడా తెలియకపోవడం దురదృష్టకరం. అది తెలుసుకుందామనే నేను, నా మిుత్రలు బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌, దేవేందర్‌ త్రిపాఠి కలిసి అక్కడికి వెళ్ళాము.

అలసట కలగకుండానే, ఏ ప్రయత్నమూ చేయకుండానే ఎంతో అద్భుతమైన దృశ్యం కనిపించినా మనకు అంత ఆనందం అనిపించదు. అదే దాని అందాన్ని మనం వెతికి పట్టుకునే ప్రయత్నం కొంత చేసి సఫలీకృతమైనప్పుడు కలిగే ఆనందం ఒక మధుర సృతి అవుతుంది. మాకు ఈ గ్రీన్‌ వ్యాలీలోని ‘గాడి’ద గుండాన్ని చేరుకుని చూసినప్పుడు మిగిలింది ఈ మధర సృతి. అంటే గాడిద గుండం దర్శనం ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్నిచ్చి అదొక మధురస్మృతిగా మిగిలేందుకు దోహదం చేసింది. 

గ్రీన్‌ వ్యాలీలో ట్రెక్కింగ్‌
gaaDaహైదరాబాద్‌ నుండి నిర్మల్‌, నేరేడిగొండ, తర్నం లేదా దేవల్‌నాయక్‌ తండల మీదుగా ప్రయాణిస్తే 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గాడిదగుండం జలపాతం. దీన్ని చేరడానికి పచ్చని అడవులు, గుట్టలు, లోయల్లో మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కడెంనది ఒక్కోసారి వరద ఎక్కువై దాటనివ్వదు. మాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకని మేము దేవల్‌ నాయక్‌తండా దాటి, సమీప గ్రామస్థుడు కిషన్‌ను తీసుకుని ఈ జలపాతం దగ్గరికి వెళ్ళాం. ఐతే ఇక్కడికి నిర్మల్‌, ఇచ్చోడ, సిరిచెల్మ, పట్టణం, గుండిబాగ్‌ల మీదుగా వాహనంలో కూడా రావ చ్చునట. ఈ ప్రాంతంలో మరాఠీలు, లంబాడీలు, గోండులు, ఆంధ్‌లు, ముస్లింలు మ్త్రామే కాకుండా గిరిజనేతరులు కూడా ఉన్నారు. 

అంటే ఈ ప్రాంతంలో విభిన్న జాతుల సమ్మేళనాన్ని, వైవిధ్య సంస్కృతులను...భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడవచ్చు. కొందరు ఈ జలపాతాన్ని ముక్కిడి గుండం అని పిలిస్తే, మరి కొందరు గాడిద జలపాతం అంటారు. నిజానికి స్థానిక ప్రజలు ఈ జలపాతానికి మొక్కుతారు. అందుకే దీన్ని ‘మొక్కుడు గుండం’ అని, ఇది ‘గాడి’లో నుంచి దుముకుతుంది కాబట్టి ‘గాడి’ద గుండం అని పేర్లు వచ్చాయి. 

పర్యాటకులు ఈ ప్రాంతీయులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు మధ్య నుండి నడచిపోవాల్సి ఉంటుంది. మన చుట్టూ ఎత్తు పల్లాల్లో గుట్టలు, చెట్ల మధ్య అటవీ ప్రదేశాన్ని చదును చేసు కుంటూ వివిధ రకాల మెట్ట పంటలను సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులు కనిపిస్తారు. సౌంద ర్యమే కాకుండా పచ్చని లోయల్లోని నల్లని నేలల్లో పరుచుకున్న పచ్చని పైరుల సోయగాలను కూడా చూడొచ్చు. 

అక్కడక్కడా గుట్టబోర్లు, ఎతైన గుట్టలు, అడవులు, లోతైన లోయలు, ఇరు కైన దారి, ఎడ్లబళ్ళ చక్రాల గాడులు, పచ్చని చెట్ల మధ్య చిన్న, చిన్న కుంటలు, వాటి నీటిని తాగడానికి వచ్చిన జంతువుల కాళ్ళ డెక్కల గుర్తులు, జల జలా పారుతూ మనకు అడ్డంగా వచ్చే ఏరులు, పచ్చిక బయళ్ళు మేస్తున్న పశువులు, వాటిని కాపలా కాసే గోండులు, ఆంధ్‌లు, అటవీ మార్గంలో ఎలుగుబంట్లు, అడవిపందులు ఎదురవుతాయేమోనన్న భయం. వీటిల్లో ప్రతి ఒక్కటీ మన మనోఫలకంపై ముద్రించుకుపోయే మధుర స్మృతులను మిగుల్చుతాయి. 

ఎతైన, లోతైన జలపాతం
గాడిదగుండం జలపాతం పరిసరాలే మనల్ని పరవశానికి గురిచేస్తాయి. చుట్టూ గిరిగీసినట్లుండే ఎతైన పచ్చని కొండల మధ్య వంపు తిరిగిన వ్యాసంలా ఒక వాగు ప్రవహిస్తుంది. అదీ ఒక ఇరుకైన గాడిలో. చిక్కని ఎతైన చెట్ల మధ్యలో, గుండిబాగ్‌ అనే అంధలగూడెం సరిహద్దుల్లో పచ్చని చెట్ల మధ్య నుండి తెల్లని వాగు వడివడిగా ప్రవహిస్తుండటం చూసి పరవశించిపోతాం. అంత కంటే పరవశించే దృశ్యం అల్లంత దూరంలోనే కనిపిస్తుంది. అదే అసలైన అందమైన జలపాతం. అలాగని దాని అందం అంత సులభంగా కనిపించదు. వినిపిస్తుంది. 200 అడుగల ఎత్తు నుండి దూకే శబ్దం. ఇది మనరాష్ర్టంలోనే ఎతైన జలపాతాల్లో ఒకటి. 

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమవుతుంది . తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన ఆసక్తికరమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపిం చింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం. 

సుందరమైన లోయ
jalapaaaగాడిదగుండం జలపాతం ప్రాంత దృశ్యం కాశ్శీర్‌ లోయను మరిపిస్తుంది. ఈ జలపాతం చుట్టూ 500 అడుగుల ఎతైన కొనదేలిన కొండల వరుసలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ముసురుకు న్నాయి. ఈ కొండల మధ్య తూర్పు సగభాగం ఎతైన పీఠ భూమి, పశ్చిమ సగభాగం ఏటవాలు లోయ. ఎంతో అందంగా కనిపిస్తుంది. పీఠభూమిని ఈశా న్యం కొండల మధ్య సన్నని చీలక నుండి, దక్షిణపు కొండల గుండిబాగ్‌ ఏటవాళ్ల నుండి చేరుకో వాలి. లోయనైతే పశ్చిమపు కొండలు (మాదా రం) దిగి చేరుకోవాలి. వర్షాలు ఉధృతంగా లేన ప్పుడు కడెం నది మనల్ని దాటనిస్తుంది. 

అప్పుడు ఈ లోయ లోని తర్నం, దేవల్‌నాయక్‌తండా పొలి మేరల నుండి కాలినడకన చేరుకోవచ్చు. ఇలా వచ్చిన ప్పుడు జలపాతం కింద ఉన్న లోయ లోకి చేరుకుంటాం. జలపాతం ఎత్తు, అందాన్ని సంపూర్ణంగా చూసి ఆనందిచవచ్చు. పీఠభూమిపై నుండి వస్తే దాని ఎత్తు సగమే కనిపిస్తుంది. 500 అడుగుల ఎత్తున్న పచ్చని కొండల మధ్య ప్రవహిస్తూ, 200ల అడుగుల ఎత్తు నుండి తూర్పు నుండి పశ్చిమం వైపు దూకుతూ, 100 అడుగుల ఎతైన నల్లని రాళ్ల మధ్య కనుమరగయిన తెల్లని జలపాతం మళ్ళీ ఉత్తర వాయువ్యంలో కొండ అడ్డు రావడంతో వంపు తిరిగి పశ్చిమం మీదుగా నైరుతి వైపు అర్థచంద్రాకారంలో నీలిమేఘాలను ప్రతిఫలిస్తూ ఒయ్యారంగా సోయగాలు పోతు ప్రవహించే దృశ్యాన్ని ప్రతిఒక్కరూ చూసి తరించాల్సిందే. 

మాదారం నుంచి గాని, తర్నందేవల్‌ నాయక్‌ తండా మీది నుంచి గానీ వచ్చేవారు జలపాతం కిందుగా పారే వాగు ప్రవాహం వెంట సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పచ్చని చెట్ల మీద చేస్తున్న పక్షుల కిలకిల రావాలను వింటూ నడక సాగిచడం మన జీవితంలో మరిచిపోలేని మధురానిభూతిని మిగులుస్తుంది. ఇక్కడ రోప్‌వే నిర్మిస్తే ఇదొక అద్భుతమైన ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ కాగలదు. జాతీయ రహదారి నెం.44కు దగ్గరగా ఉండటం వల్ల పర్యాటకులతో కిటకిటలాడే అవకాశమూ ఉంది.

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమ వుతుంది. తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం.
డా. ద్యావనపల్లి సత్యనారాయణ, 9440687250