Monday 27 August 2012


రామాయణ కాలపు జలపాతాలు
పర్యాటకంలో అన్ని వర్గాల వారికీ అమితానందాన్నిచ్చేవి జలపాతాలు. కాని అవి మన రాష్ట్రంలో తక్కువగా ఉండి పర్యాటకంలో జలపాతాల లోటు ఉంది అనుకుంటున్నాం. కాని బాగా తెలుసుకుంటే ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే... అదీ ఒక్క మండలంలోనే మూడు జలపాతాలున్నాయని తెలసి ఆశ్చర్యానికి గురై ఆనందించేందుకు బయలుదేరాం నేను, నా మిత్రలు దేవేందర్‌ త్రిపాఠి, ఇందూరి ప్రవీణ్‌, గడ్డం అనిల్‌. స్థానికులు సునిల్‌, అనిల్‌రెడ్డి, రమణారెడ్డిలు మా ప్రయాణాన్ని సుగమం చేశారు.

మేము దర్శించి హర్షించిన జలపాతాలు గౌరీ గుండం జలపాతం, దాని పరిసర గుండాలైన సీతమ్మ కొల్లుగుంట, పులిగుండం మరియు రాముని గుండాలు. ఇవన్నీ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ రామాయణ కాలపు నేపథ్యగానాలున్నాయి. మొదటి మూడు గుండాలు హైదరాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, సబ్బితం మీదుగా ప్రయాణిస్తే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన గౌరీ గుండం సులువుగా చేరుకొని ఆనందించడానికి అనువుగా ఉంది. ఇక రాముని గుండాల హైదరాబాదు నుండి పెద్దపల్లి, రామగుండం బి-పవర్‌హౌజ్‌ గడ్డ మీదుగా ప్రయాణిస్తే 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గమ్మతె్తైన గౌరీ గుండం
G-(4)సబ్బితం నుండి గట్టుసింగారం వైపు కచ్చారోడ్‌ మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు అడ్డంగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు కొనసాగుతున్న కొండల వరుస పచ్చని అడవులతో కళకళలాడుతూ కనిపిం చి కనువిందు చేస్తుంది. మనం ఆ కొండలకు దగ్గరవుతున్నకొద్దీ ఆ పచ్చని కొండల మధ్యనున్న ఒకే ఒక నల్లని లోయ మన దృష్టిని ఆకర్షి స్తుంది. ఆ నల్లని లోయ మీద దృష్టి నిలుపగానే కొండ లపై నుండి ఆ లోయలోకి దుముకుతూ కనిపించే తెల్లని జలపాతం మన ఉల్లమును జల్లనిపి స్తుంది. ఆ సుందర దృశ్యానికి తోడు ఆ జలపాతపు హోరు మన ఉత్సాహాన్ని ఉరకలు పెట్టి స్తుంది. ఇక ఆగితేనా! మాలో ఒకర్ని విడిచి ఒకరు ఉరుకులు పరుగుల మీద ఆ జలపాతాన్ని చిటికెలో చేరుకున్నాం.సుమారు 150 అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్ర మధ్య భాగం నుండి... అంటే సుమారు 70 అడుగుల ఎత్తు నుండి పశ్చిమాభిముఖంగా ‘సుయ్‌’ మని సూటిగా నింగి నుండి నేలకు దుముకుతున్న సుందర దృశ్యం ఈ జలపాతం సొంతం. 

నయనానందకరం దాని పరిసరం. 
వీనుల విందు దాని పొందు. 
కరచరణ స్ఫూరితం దాని చరితం. 
స్వరపేటిక ప్రేరితం దాని పాటవం.
కవి కలానికి ఇంపు దాని సొంపు. 

దాని సోయగాన్ని చూసి, దాని నడక సవ్వ డిని విని, దాని కింద తడిసి ముద్దయితే తప్ప ఆనందానికి నిర్వచనం లేదనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే, మేము అలాంటి ఆనందానికి పాత్రులమయి చెప్పున్న విషయాలివి.జలపాతపు తెల్లదనమే దాని కింద ఏర్పడిన గుండంలో కూడా కనబడడం, పైగా ఆ గుండం ఎనిమిది అడుగుల కన్నా ఎక్కువ లోతు లేకపోవడంతో ముందుగా మేము అందులోకి దిగి స్నానాలు చేశాం. ఈత కొట్టాం. కేరింతలతో క్రమక్రమంగా ముందుకి వెళ్లి జలపాతపు ధార కిందికి చేరాం. 

మా తల, వీపులపై నురగలు గక్కుతూ గమ్మతుత్గా దుముకుతున్న జలధారల స్పర్శానుభూతికి పరవశులమయ్యాం. చిన్నపిల్లలమై మరింత స్వరం పెంచి కేరింతలు కొట్టసాగాం. ఐదు నిమిషాల తర్వాత అకస్మాత్తు జలపాతపు ప్రవాహం పెరిగింది. మొదట భయపడ్డాం. బయటికి పెరుగెత్తుకు రావాలనుకుంటుండగానే మరో వింత జరిగింది. మళ్ళీ అకస్మాత్తుగా జలపాతం తడవలు తడవలుగా చల్లగా ఓసారి, వెచ్చగా ఓసారి పడటం ప్రారంభమైంది. అది గమ్మతె్తైన వింత అను భూతినివ్వ సాగడంతో ఏమైతే అదవుతుందని అలా ఆనందిస్తూ దాని కిందే ఉండిపోయాం. త్రిపాఠిగా రయితే ‘ఇలా జలపాతం కింద ఉంటే అరగంటలో అద్భుతమైన నీటి మసాజ్‌ అయ్యి చర్మ రోగా లన్నీ మాయమౌతాయి’ అని కితాబిచ్చారు. ప్రవీణ్‌గారు ఫోటోల్లో ఆ అనుభూతులను బంధించారు. అయితే నిజానికి సబ్బితం గ్రామస్థులు చెప్పినట్లే... మా కేరింతల శబ్దాల ప్రతిధ్వనులు చుట్టూ ఉన్న గుట్టల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన వెచ్చని నీటిని బయటికి లాగాయని అర్థమైంది.

పరిసరాల పారమ్యం
G36ఈ జలపాతం కుడివైపు ఉత్తరాన ఉన్న గుండుకు గౌరీ విగ్రహం చెక్కించ బడి ఉండడంతో ఆ దేవత పేరు మీదనే ఈ జలపాతానికి గౌరీ గుండం అనే పేరొ చ్చింది. దాని పక్కనే వినాయక విగ్రహముంది .ఈ మొత్తం శిల్ప సముదాయం సప్తమాతృ కలకు సంబంధించింది అయ్యుంటుంది. జలపాతానికి ఎడమవైపు దక్షిణాన 15 అడుగుల ఎత్తున గుట్టలో పలికి నిలువెత్తు గుహను తొలిచి, మూడు స్తంభాలపై ఆలయ పైకప్పు ఉన్నట్లు తీర్చిదిద్ది ఆలయం లోపల ఈశాన్యం మూలలో త్రిమూర్తుల రేఖా చిత్రాలను, మధ్యలో శివలింగాన్ని చెక్కారు. స్తంభాలు అజంతా స్తంభా లను పోలి ఉన్నాయి కాబట్టి, ఈ ఆలయ చరిత్ర సుమారుగా వేయిన్నర సంవత్స రాలనాటిదని చెప్పవచ్చు. ఆలయం ముందు వాయువ్యంలో జలపాతం తుంపర్లలో తడు స్తున్న బండకు పద్మా సన స్థితిలో కూర్చున్న జైనమాత తీర్థంకర విగ్రహం, దానికి కుడివైపున నాగబంధం, నెమలి, సూర్యచంద్రుల శిల్పాలు చెక్కి ఉన్నాయి. 

ఈ ఆలయ సముదాయ శిల్పాలను స్థానికులు గొల్లభామలు అంటున్నారు. జలపాతపు కొండపైన శిధిలమైన ‘బయ్యన్నగుడి’ అనే జైన దేవాలయం ఉంది. ఈ జైన వాస్తు శిల్ప సాంప్రదాయం రాష్టక్రూట రాజుల కాలానిది (క్రీ.శ. 10-11 శతాబ్దాలది) అయ్యుంటుంది. బయ్యన్నగుడికి అల్లంత దూరంలో ‘మామిడికుంట’ అనే చెరువుంది. దాని పరిసరంలో సుమారు రెండు వందల ఎకరాల భూమి ఉంది. దాన్నంతటినీ సాగు చేయవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామస్థులకు కూలీలిచ్చి కొన్ని ఎకరాల భూమిని సేద్యయోగ్యం చేయించారు. ఫలితంగా ప్రస్తు తం సుమారు 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు కూడా. అక్కడికి వెళ్ళేందుకు కూడా కొండ మీదకి ఏటవాలును బట్టి రైతులు, పశువులు వెళ్ళే మార్గం కూడా ఏర్పరచుకు న్నారు. కొండపైన ఇలా వందల ఎకరాల సమతలం ఉండడం, మిగతా ప్రపంచంతో మాత్రం సంబంధం లేకుండా ఉండడం. ఇవన్నీ చూస్తే ‘ఆకాశంలో ఐలాండ్‌’ను చూస్తున్నట్లుంది.ఇక ఓపికున్నవారు ఈ జలపాతానికి దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సీతమ్మ కొల్లుగుంట’ అనే గుండాన్ని, ఉత్తరాన ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ‘పులిగుండం’ అనే గుంఆన్ని కూడా చూడవచ్చు. వాటి ప్రాకృతిక సౌందర్యాన్ని చూసి వాటి వద్దకు నడిచిన శ్రమను మరచిపోతాం.

రాముని గుండాలు
G66రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపైనున్న ‘రామగుం డం’ అనే చెరువు. ఈ చెరువు కొన్ని కిలోమీటర్ల పొడ వుతో దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు కొనసాగుతున్న కొండ వరుస మధ్యలో ఉంది. వర్షాలు ఎక్కువైనప్పుడు ఆ చెరువు నిండి పొంగే ప్రవాహం ఉత్తరం వైపుకు లోయ మార్గంలో ప్రవహిస్తూ ఒక కొండ కొన మెట్ల మీద నుంచి దుము కుతూ మూడు నాలుగు దఫాలుగా చిన్న చిన్న జలపాతా ల్లాగా దర్శన మిస్తుండి. ఆ జలపాతాల కింద రెండు నుంచి నాలుగు గజాల వ్యాసంతో అందమైన గుండాలే ర్పడ్డాయి. ఇవే ‘రాముని గుండాలు’. ఈ గుండాల్లో నిలబడి జలపాతాల కింద జలకాలా డడం మధురాను భూతినిచ్చింది. 

గుండాల ఒడ్డు మీద కూర్చుని గుండంలోకి కాళ్ళు జారవిడిచి ఆ నీళ్ళల్లో ‘చలక్‌ చలక్‌’ మని కొట్టడం.. నడవడం... ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకోవడం... ఈ చిలిపి చిన్నారి పనులన్నీ పెద్దలకు కూడా ఇక్కడ సాధ్యమే.గుండాల్లో నుంచి పారుతున్న నీళ్ళన్నీ ఇరుకైన రాతి లోయలో నుంచి తూర్పు వైపున కుంటలోకి చేరుతున్నాయి. రెండు గుట్టల పదాల మధ్య ఆ కుంట చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని మరింత ఆస్వాధించాలం టే ఆ కుంటలో చిన్న చిన్న బోట్లు ఏర్పాటు చేయాలి. కొండ పైనున్న గుం డంలో కూడా ఈ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికైతే కొండ పైనున్న ఈ గుండం వరకు ఒక కిలోమీటరు దూరం వరకు ట్రెక్కింగ్‌ చేసి ఆనందించవచ్చు.

పరిసరాల వైశిష్ట్యం
రాముని గుండాల వైపు వెళ్తున్నప్పుడు గుట్ట కింద తూర్పుకాభిముఖంగా ఒక వీరగల్‌ విగ్రహ ముంది. స్థానిక ప్రజల సంరక్షణ కోసం శత్రు సైన్యాలతో యుద్ధం చేసి వీరమరణం పొందినవారి త్యాగాన్ని స్మరించుకోవడం కోసం మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి వీరగల్‌ విగ్రహాలను ప్రతిష్టించేవారు - సాధారణంగా యుద్ధం జరిగిన ప్రదేశంలోనే. ఈ విగ్రహానికి ఇప్పుడేమో భక్తులు జాజు పూసి దాన్ని హనుమంతుడుగా పేర్కొంటున్నారు. ఈ వీరగల్‌ విగ్రహం దాటి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆరు అడుగుల ఎతె్తైన ఏకశిలా వినాయక విగ్రహ ముంది. అది ఈ మధ్యనే వర్షాల వరదలో గుట్టపై నుండి కిందికి దొర్లి పడిందట. ఆ విగ్రహ శైలీ విశేషాలను బట్టి అది కనీసం వేయి సంవత్సరాలకు ముందటిదని అర్థమువుతుంది.

వినాయక విగ్రహంలాగే కొండ మీద వేంకటేశ్వర విగ్రహం కూడా బయటపడిందట. అక్కడికి వినా యక విగ్రహం దాటి కొండ ఎక్కి వెళ్ళాలి. ఆ విగ్రహానికి ఆలయం కట్టించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముందుకొచ్చారట. కాని స్థానిక నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ వారు ఆ పనిని తామే చేస్తామని ముందుకొచ్చి మూడు కోట్ల రూపాయలతో ప్రస్తుతం కొండపైకి రోడ్లు వేయిస్తున్నారు. కొండ శిఖరాగ్ర భాగాన ఒక అందమైన శిలా మండపం ఉంది. దీన్ని గౌరీ మంటపం అంటున్నారు. ఇది రోడ్‌ మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా కనిపిస్తుంది. ఈ రాముని గుండాల రాతి గుట్టలు చాలా ప్రత్యేకమైనవి, అరుదైన అందంతో అరారుతున్నవి. 

చాలా భాగం వరకు చెట్లు లేకుండా ముడి ఇనుప గుట్టల్లాగా కన్పిస్తాయి. వీటిల్లో అక్కడక్కడా గుహలేర్పడ్డాయి. వాటిలో విగ్రహాలను పెట్టి వాటి చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు కట్టారు. మొదట ఈ ప్రాంతం నాగజాతి వారిదేమో - అందుకే నాగశిల్పాలు అరడజనుకు పైగా వివిధ రూపాల్లో ఉన్నాయి. తరువాత ఇక్కడికి రాముడు వచ్చిన నిదర్శనంగా ఇక్కడ ప్రధాన రామాల యం ఉంది. ఇక్కడి గుండాల్లో రాముడు సీత ఆనందించారనడానికి నిదర్శనంగా ఇక్కడ రాముడు -సీత ఆలింగన శిల్పాలు అరఫీటు ఎత్తుతో కన్పిస్తున్నాయి. రామాలయం పక్కన రామానుజస్వామి విగ్రహముంది. దాని పక్కన ఒక గుహాలయముంది. 

ఈ ఆలయాలకు ముందు శైవ శాక్తేయ మత విశిష్టతను విశదపరిచే నంది, లింగం, కాలభైరవ, శక్తి తదితర శిల్పాలు, దేవాలయాలున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ. 10-11 శతాబ్దాలు) కట్టినట్లు వాస్తు విశేషాలనుబట్టి తెలుస్తోంది.ఇలా చారిత్రక ప్రాకృతిక సౌందర్యాలకు ఆలవాలమైన ఈ గౌరీగుండం, రాముని గుండాల జలపాతాలు ప్రకృతీ ప్రియులను అలరిస్తాయనడంలో అనుమానం లేదు.

- డా ద్యావనపల్లి సత్యనారాయణ, 9440687250

Friday 17 August 2012

Thirumalanathakonda published in Surya on 14-08-2012


తిరుమలనాథ కొండ
పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాం తపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో... ప్రత్యేకించి ఉద్యోగ కుటుం బాల్లో అరుుతే, ఒకటి రెండు రాషాట్రలు మినహా మిగతా అన్ని రాషాట్రల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ఒక్కరోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు... నగరాల చుట్టు ఎన్ని ఉన్నారుు?’ అనే ప్రశ్నకు సమాధానం అలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉన్నారుఅని వస్తుంది. అలాంటి అరుదైన పర్యాటక స్థలాల్లో ఒకటి తిరుమలనాథ కొండ’.
తిరుమలనాథ కొండ మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం పెద్ద రేవళ్ళ గ్రామ పరిధిలో ఉంది. హైదరా బాద్‌ నుండి బాలానగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి 80 కిలోమీ టర్లు. ప్రకృతిని ఇష్టపడేవారు షాద్‌నగర్‌, బూర్గుల మీదుగా వెళ్తే 70 కిలోమీటర్లు. అయితే రెండవ దారిలో వెళ్ళేవారు సుమారు 10 కిలోమీటర్లు కచ్చా రోడ్డు మీద వెళ్ళవలసి ఉం టుంది. ప్రకృతిని ఎంతో ఇష్టపడే నేను... నా సీనియర్‌ మిత్రు లు బుచ్చిరెడ్డి, దేవేందర్‌ త్రిపాఠీ కలిసి రెడ్డి గారి కారులో బూర్గుల మీదుగానే వెళ్ళాము.
ప్రకృతి సోయగాల నడమ
బూర్గుల గ్రామ పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. నిజా నికి వర్షాకాలంలో పంటలతో పచ్చగా అలరారవలసిన బూర్గు ల భూములు బీడుపోయి వర్షానికి పచ్చని గరిక గడ్డి సమానం గా పెరిగి కావాలసి పెంచిన లాన్‌లలాగా కనిపిస్తాయి. గుట్టబో ర్ల ఏటవాలుల్లో రైతులు మలుచుకున్న చిన్నచిన్న పంటమడు లు అలా గరిక గడ్డితో పచ్చని రంగు పులుముకొని ఊటీ, అస్సాం టీ, కాఫీ పైరులను తలపిస్తాయి. ఆ మడుల మధ్య పల్లం వైపు చిన్నచిన్న నీటి ఏరులు ప్రవహిస్తున్నాయి. ఆ పచ్చ ని మడుల మధ్యే అక్కడక్కడా తెల్లతెల్లని ఆవుల మందలు, నల్ల నల్లని బర్రెల మందలు, గొర్రెల మందలు పచ్చిక మేస్తూ తిరుగాడుతాయి. ఇవన్నీ చూశాక ఇక ఊటీ వెళ్ళడం దండగ అనిపిస్తుంది.

ఇక తిరుమలనాథ కొండ ఎక్కిన తరువాత మనల్ని మనం మరచిపోక తప్పదు. అంత అందంగా ఉంటాయి దాని పరిస రాలు. తిరుమలనాథ కొండ చుట్టూ సుమారు పది కొండలు న్నాయి. వాటిలో అన్నింటి కన్నా పెద్దది ఇదే. కాబట్టి ఈ కొండ పైకి ఎక్కితే మిగతావి చిన్న కుప్పల్లాగా అందంగా కనిపిస్తాయి. ఈ కొండ వాయువ్యంలో ప్రారంభమై ఒక లోయ ఆగ్నేయం వైపు అలవోకగా సాగిపోతుంది. ఆ లోయలో ఏపుగా పెరిగిన ఎర్రని భూముల మధ్య పచ్చని వలయం లాగా ఒక చిత్రకా రుని కాన్వాస్‌పై పెయింటింగ్‌లా కనిపిస్తాయి. వాటి పైనుంచి వీస్తున్న ఈదరగాలి మన ముంగురులను, దుస్తులను రెపరెప లాడిస్తూ గిలిగింతలు పెడుతుంది. కొండ శిఖరం పైకి ఎక్కి కొండకు తూర్పున కొనసాగుతున్న కచ్చా రోడ్డును చూస్తే అది పచ్చని వెంట్రుకల (పక్కనున్న చెట్టతో కూడిన లోయ) మధ్య గోధుమ వర్ణము పాపిటలాగా అందంగా కనిపిస్తుంది.

వినోదం + విజ్ఞానం = ట్రెక్కింగ్‌
తిరుమలనాథ కొండ పైకి చేరుకోవాలంటే అక్కడక్కడా ఉన్న సమతలపు గుట్టబోర్లతో పాటు సుమారు 275 మెట్లు ఎక్కాలి. అయితే మెట్ల సంఖ్యను చూసి అమ్మో! అని భయపడనక్కర్లేదు. ఎందుకంటే, ఈ మెట్లు ఎత్తు తక్కువగా ఉంటాయి. పైగా మెట్లకు ఇరువైపులా మనకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే ఎన్నో వింతలు, విశేషాలు మనకు ట్రెక్కింగ్‌ అలసటను తెలియకుండా చేస్తాయి.
తిరుమలనాథ కొండ ప్రకృతి సౌందర్యంతో పవిత్రమైందన డానికి నిదర్శనంగానేమో మనకు ట్రెక్కింగ్‌ ప్రారంభంలోనే ఒక చిన్న ఏరు జలజలా పారుతూ ఎదురవుతుంది, మన పాదాలను ప్రక్షాళన చేస్తుంది. ఆ ఏరు చుట్టూ ఏడెనిమిది రాతి స్తంభాలు నిలబెట్టి ఉన్నాయి. వాటి దగ్గరికెళ్ళి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఒక్కో స్తంభానికి నాలుగు వైపులు... ఒక్కో పక్క ఒక్కొక్క కథను లేదా పౌరాణిక ఇతివృత్తాన్ని తెలిపే నాలుగైదు శిల్పాలు ఒక్కో అడుగెత్తు చొప్పున చెక్కారు. ఇలాంటి స్తంభాలను శిల్పం నేర్చుకునేవారు గాని, దాతలు గాని చెక్కి(ంచి) ఉంటారు.
అలాంటి ఒక స్తంభానికి పులిని వేటాడుతున్న వీరత్వాన్ని, మ ద్దెల వాయిద్య నృత్యాలతో కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్న ఒక పురుషుడిని ప్రేమించిన ఒక యువతి, అతనికి పావురంతో తన
ప్రేమ సందేశాన్ని పంపి, అతని ప్రేమను గెలిచి, ఆచంద్ర తారార్కంగా పెళ్ళి చేసుకొని దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్న ట్లుగా శిల్పాలు చెక్కబడ్డాయి. అయితే చివరిదైన పురుషాయిత రతిశిల్పం వామాచార శాక్తేయ మత ప్రాభవాన్ని సూచిస్తుందేమో! ఇంకొక స్తంభ శిల్పంలో కృష్ణుడు కాళీయమర్ధనం చేస్తున్న దృశ్యం చెక్కబడింది. మరో స్తంభానికి మూర, గజం, జాన అనే కొలతలు చెక్కి ఉన్నాయి. ప్రాచీనకాలంలో స్థానిక రాజు ఆ ప్రాంతంలో భూములను తన మూర, జాన, గజం, బారెడు (రెండు గజాలు) కొలతలతో ప్రజలు కొలుచుకునేందుకు వీలుగా ఇలా అక్కడక్కడా ఏర్పాట్లు చేశాడట.

ఇలాంటి శిల్పకళాశోభితమైన స్తంభాలు దాటగానే మెట్లు కనిపిస్తాయి. మెట్లకు ఇరువైపులా చిన్న చిన్న రెయిలింగ్స్‌ ఉంటాయి. ఒక్కో రెయిలింగ్‌ రాయికి రెండు కొనల్లో రెండేసి గుంతలుంటాయి . ఆ గుంతల్లో పూర్యకా లంలో పర్వదినాల్లో నూనెపోసి, వత్తులు వేసి వెలిగించేవారట. ఎంతటి ఆసక్తిని రేపే ఏర్పాట్లో!అనుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తే మనల్ని మరింత ఆనందానికి గురిచేసే శిల్పాలు కనిపిస్తాయి. ఇవి మెట్లకు రెండు పక్కలా అక్కడక్కడా ఉన్న సహజమైన గ్రానైట్‌ శిలలకు చెక్కబడ్డాయి. ఇలాంటి శిల్పాల్లో ఎక్కువగా హనుమంతుడు వివిధ రూపాల్లో చెక్కబడ్డా డు.తమకు ఆపదలు తొలిగి సంపదలు కలిగినప్పుడు భక్తులు ఇలాంటి శిల్పాలను చెక్కించడం అనాదికాలంలో ఆచారంగా ఉండేది.

సహజ శిల్పసౌందర్యం
తూర్పు నుంచి పడమడివైపు సాగుతున్న మెట్ల మార్గమధ్యంలో ఎడమ వైపు పందిరి వేసినట్లు ఒక సహజ శిలాతోరణం ఉంది. దీనిలో పూర్వం ఒక దేవతా విగ్రహం ఉండేదన్నట్లు కనిపిస్తుంది. కనుకనే దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అదీ సహజ శిలలదే!ఈ సహజ శిలాతోరణం ముందు నిల్చుని ఉత్తరం వైపు చూస్తే ఊపిరి పీల్చుకుని, గుండెమీద చేయివేసుకుని అమ్మ ఎంత అందమైన శిలలుఅనిపించే సహజ శిలా శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఒక శిలా సముదా యంలో మొగ్గ విప్పిన రేకులతో కమలం, తిరునామాలు కనిపిస్తే...

మరో శిలా సముదాయంలో ఎత్తు మీదున్న కప్పను ఒక తాబేలు ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంటుంది. ఇంకొక శిల ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. ఇలాంటి సహజ శిలాకృతులు కొన్నింటిని హైద రాబాద్‌లోని శిల్పారామంలో చూస్తాం. అయితే అవి ఎక్కడినుండో తెచ్చి కృత్రిమ వాతావారణంలో పెట్టినవి. కాని ఈ తిరుమలనాథ కొండ మీద ఉన్నవి సహజవాతావరణంలో అత్యంత సౌందర్యంతో భాసిల్లుతు న్నాయి.

కోటగోడలు - యుద్ధపు ఆనవాళ్ళు
తిరుమలనాథ కొండ ప్రాంతం ఒక ప్రాంతీయ రాజ్య ప్రాధాన్యమున్న స్థలంగా కనిపిస్తుంది. కొండ ఎక్కడానికి ముందే ఒక వీరుని శిల్పం (వీరగల్‌), వీరధ్వజ స్తంభం కనిపిస్తాయి. వాటి ఆధారంగా అక్కడ ఈ మధ్య ఒక హనుమాన్‌ మందిరం కట్టారు. తమ ప్రజల సంక్షేమం కోసం శత్రుసైన్యాలపై పోరాడి వీరమరణం పొందినవారికి గుర్తుగా ఇలా వీరగల్లు శిల్పాలను చెక్కించే ఆచారం మూడు నాలుగువందల సంవత్స రాల క్రితం వరకూ మనుగడలో ఉండేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పు డు ఎవరెవరికి యుద్ధం జరిగిందో పరిశోధించవలసి ఉంది.

ఇక సహజ శిలా మండపం మొదలుకొని మనకు మెట్లెక్కుతున్నప్పుడు రెండు పక్కలా కోటగోడను నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మెట్లెక్క డం పూర్తయినాక సమతలంలో రెండు మూడు ఆలయాలున్నాయి. ఈ సమతలం చుట్టూ కోటగోడ ఉంది. అంటే దేవాలయాల చుట్టూ కోట గోడ కట్టారన్నమాట. అలాంటి రక్షణ గోడ కట్టడం వలన పశ్చిమాభి ముఖంగా ఉన్న ప్రధానాలయానికి ముందర రెండు సహజ కుంటలు ఏర్పడ్డాయి. మరో కోనేరును దానికి సమీపంలో కట్టారు. ఈ మూడు నీటి వనరులు యుద్ధ సమయాల్లోనూ, సాధారణ సమయాల్లోనూ ఈ కొండపైనున్నవారికి అవసరాలు తీర్చేవన్నమాట.

ప్రధానాలయ గోపురంలో కూడా నలుదిక్కులా శత్రువులో ఆయుధాలను ప్రయోగించే ఏర్పాట్లు (గూడులు) ఉన్నాయి. తెలుగు దేశంలో ముస్లింలు ప్రవేశిం చాక (14-16 శతాబ్దాల) వారి వల్ల హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని, అందుకే వారి బారినుంచి తమ దేవాలయాలను రక్షించుకు నేందుకు హిందువులు వాటి చుట్టూ రక్షణ కోటగోడలను నిర్మించుకు న్నారని చారిత్రకులు చెబుతారు. అలాంటి ఏర్పాట్లనే మనం ఇక్కడ చూస్తాం.
ఆలయం వైచిత్య్రం
ప్రధాన దేవాలయం కాలక్రమంలో ఎన్నో మార్పుచేర్పులకు గురై విచి త్రంగా కనిపిస్తుంది.సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే దీనికి మాత్రం పశ్చిమపు వాయు వ్య ద్వారాలు ప్రధాన ద్వారాలు కాగా ఉత్తరాభిముఖంగా రెండు ద్వారాలు, దక్షిణ ఆగ్నేయం లో మరో ద్వారం ఉంది. దేవుడిని కూడా తిరుమల నాథుడని, వేంకట్వేరుడని, సీతారాముడని, విష్ణువని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఆలయానికి దక్షిణం, పశ్చిమ దిశల్లో మంటపాలున్నా యి. ఉత్తర దిశన ఉన్న గుండ్లకు హనుమాన్‌, గరుత్మంతులవి రెండేసి విగ్రహాలు తొలిచి ఉన్నాయి . ఆలయ భాగంలోనే ఈశాన్యంలో అమ్మవారి గుడి ఉంది. గర్భగృహానికి ఉత్తరంగా ఉన్న రంగ మంటపం నల్లరాతి స్తంభాలతో శిల్పకళాశోభితమై చూపరులను కట్టిపడేస్తుంది.

ఆలయం చుట్టూ ప్రదక్షిణపథం ఉంది. ఆలయం వెనుకవైపున్న సహజ శిలలు, గుహలు మన దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయానికి వాయువ్యదిశలో ఆళ్వార్ల మందిరం ఉంది. నైరుతి దిశలో కొంత దూరా న మరో మందిరం ఉంది. దాన్ని హనుమాన్‌ మందిరం అంటున్నారు. కాని అందులోని రాయికి చెక్కిన విగ్రహం మాత్రం హనుమంతుని చిత్రంలా లేదు. ఈ మందిరానికి తూర్పున ఉన్న ఇంకో చిన్న మంది రాన్ని ఇటీవలే దుండగులు ధనం కోసం ధ్వంసం చేశారు.
ప్రధానాలయానికి ఎడమపక్కన ఒకప్పుడు ఒక పెద్ద మఠం లేదా సత్రం ఉండేదనడానికి నిదర్శనంగా దాని పునాదులు కనిపిస్తున్నాయి. దాని ముందు వంటశాల, పూజారి గదుల పునాదులు కనిపి స్తున్నాయి. ఇప్పు డు ఈ పరిసరాల్లో మేకలు మేస్తున్నాయి. అదొక అందమైనప్పటికీఓడ లు బళ్ళు - బళ్ళు ఓడలు అవుతాయిఅనే సామెత గుర్తురాక తప్పట్లేదు.

శాసనాలు - చరిత్ర
ఆలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టిన గుండు కింద రెండు గజాల పొడవుతో ఏడు వరుసల శాసనం ఒకటి ఉన్నది. ఆలయపు కుబేరస్థాన మైన ఉత్తరదిశలో ఉన్న గుండుకు చెక్కిన హనుమ ,గరుత్మంత శిల్పాల కింద రెండున్నర గజాల పొడవుతో నాలుగు వరుసల శాసనం మరొకటుంది. ఇవి రెండూ ఒకదాని తరువాత మరొకటి కాకతీయుల తరువాతి కాలంలో... అనగా 14 నుంచి 16 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కినట్టుగా లిపి పద్ధతిని బట్టి అర్థమవుతున్నది. మొదటి శాసనానికి భక్తులు సున్నం, బూజు పూశారు. కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగి కాపీ (నకలు) ఆలయపు అసలు చరిత్ర బయటికొస్తుంది. ఏమైనా ఈ శాసనాలు ఇక్కడి ఆళ్వార్ల సన్నిధి, హనుమ, గరుత్మంత విగ్రహాలు ఒకే కాలానికి చెందినవని చెప్పవచ్చు.

అయితే ఆలయ చరిత్ర మాత్రం మరో వేయి సంవత్సరాలు ముందుకెళ్తుందనడానికి ఇక్కడ నిదర్శ నాలున్నాయి. మొదట ఈ క్షేత్రం ఒక స్ర్తీ దేవతలదని తెలుస్తోంది. విగ్రహారాధన ప్రారంభమైనప్పటి నుంచీ స్ర్తీ దేవతారధన ఉంది. చారిత్రక యుగం తొలినాళ్ళలో స్ర్తీ దేవతను హారతిఅనేవారు. తొలి చాళుక్యులు ఆమెకు మొట్టమొదటి గుహాల యాలు కట్టించారు (క్రీశ 7వ శతాబ్దంలో). వారి కాలపు నిరాడంబర స్తంభాల మంటపం, స్తంభాల కింద పూర్ణకుంభ శిల్పాలు, పై ద్వారబం దానికి గజలక్ష్మి శిల్పం మొదలైన వాస్తు శిల్ప విశేషాలను ఇక్కడి ఆల యంలో చూడవచ్చు.

తరువాత వచ్చిన మలి చాళుక్యులు 10-11 శతా బ్దాల్లో ఈ ఆలయపు దక్షిణ మంటపాన్ని నిర్మించి మరికొన్ని నిర్మాణాలు చేయించి ఉంటారు. ముందున్న శిథిల సీతారామాలయంలోని సీత విగ్రహం పద్మాసనంలో యోగస్థితిలో ఉన్నది. మరోచోట చింతచెట్టు కింద ఆసీనురాలైన స్ర్తీ దేవతా విగ్రహం ఉన్నది. ఇవి కూడా మలి చాళుక్యుల కాలం నాటివే అయ్యుంటాయి. కాకతీయులు (12, 13 శతాబ్దాలు) అందమైన రంగమంటపాన్ని కట్టిం చారు. వీరి కాలానికి అటు ఇటుగా ఇక్కడ భైరవోపాసన కూడా జరిగిం దనడానికి నిదర్శనంగా కొండ మెట్లకు కుడివైపున భైరవ శిల్పం కనిపి స్తుంది. ఇక చివరిగా 15, 16 శతాబ్దాల్లో ఈ ఆలయం ఇప్పుడు కనిపిస్తు న్న వైష్ణవాలయ రూపాన్ని సంతరించుకున్నది. ప్రస్తుతం ఇక్కడ సంక్రాం తి పండుగకు జాతర జరుగుతుంది.
ఇలా చారిత్రక విశేషాలకు, సహజ సౌందర్యానికి నిలమైన ఈ తిరు మలనాథ కొండ హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉండి వారాంతపు పర్యటనలకు అనుకూలంగా ఉండడం విశేషం.
- డా ద్యావనపల్లి సత్యనారాయణ
సెల్‌: 9440687250